Homeఆంధ్రప్రదేశ్‌Jagan KTR: రహస్య చర్చలకే కేటీఆర్, జగన్ దావోస్ వెళుతున్నారా?

Jagan KTR: రహస్య చర్చలకే కేటీఆర్, జగన్ దావోస్ వెళుతున్నారా?

Jagan KTR: చాలాకాలం తర్వాత స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన మిత్రుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసే అవకాశం లభించింది.

కేటీఆర్ -జగన్ తమ షెడ్యూల్ ప్రకారం దావోస్ పర్యటనకు ముందే వెళుతున్నారు. వీరిద్దరూ ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకున్నారని.. ఐదు రోజుల కార్యక్రమంలో ఏదో ఒక సాయంత్రం ఒకరితో ఒకరు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

ఈ నివేదికల ప్రకారం.. తెలంగాణలో రేవంత్ రెడ్డి -ఆంధ్రాలో ఎన్ చంద్రబాబు నాయుడులను తమ ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తున్న వీరిద్దరూ వారిని ఎలా కట్టడి చేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చారని ప్రచారం సాగుతోంది. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు వ్యూహాలపై చర్చిస్తారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని, తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు వారిద్దరూ పరస్పరం సహకరించుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. డబ్ల్యూఈఎఫ్ సమావేశానికి హాజరుకావడం జగన్ మోహన్ రెడ్డికి ఇదే తొలిసారి కాగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో రెండుసార్లు ఇక్కడ పర్యటించారు. 2018, 2020 జనవరి నెలలో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు.

కేటీఆర్ మే 17న యునైటెడ్ కింగ్‌డమ్‌కు మూడు రోజుల పర్యటన కోసం బయలుదేరారు. ఆ తర్వాత అతను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనడానికి దావోస్‌కు వెళ్లనున్నారు. మరోవైపు జగన్ ఈరోజు ఉదయం దావోస్ బయలుదేరారు. వీరిద్దరూ అక్కడికి వెళ్లి ఏపీ , తెలంగాణ రాజకీయాలపై రహస్య సమావేశాలు నిర్వహించబోతున్నారని భోగట్టా.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular