YS Sharmila : వైఎస్ షర్మిల.. తెలంగాణలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. 3200 కి.మీల పాదయాత్ర చేసింది. అంతవరకూ అభినందించాల్సిందే.. ఎందుకంటే ఒక మహిళ అయ్యిండి 3200 కి.మీల పాదయాత్ర రెండోసారి చేయడం ఆమె పట్టుదలకు ఒప్పుకోవాల్సిందే.
కానీ షర్మిలది తప్పుడు వ్యూహాలతో రాజకీయంగా భ్రష్టుపట్టుపోయారు. ఈమె ను నమ్ముకొని తెలంగాణలో వందలాది మంది నేతలు, కార్యకర్తలు ఈమె పార్టీలో చేరారు. వాళ్లందరినీ నట్టేట ముంచడం మాత్రం ఇంతకన్నా బ్లాక్ స్పాట్ ఏముంటుంది.. ఆంధ్రాలో ఎవరైనా ఎందుకు చేరాలి షర్మిల పార్టీలో.. తెలంగాణలో షర్మిల వెంట నడిచిన నేతలందరూ గంగలో మునిగిపోయారు.
ఒక వేళ ఏపీలో అన్న జగన్ తో ఆస్తి తగాదాలు పరిష్కారం అయితే వీరందరినీ షర్మిల ముంచదన్న గ్యారెంటీ ఏంటి? అందుకే ఏపీలో షర్మిలను నమ్మే ఆస్కారం కనిపించడం లేదు.
ఇక మణిపూర్ పై కూడా షర్మిల నోరుపారేసుకున్నారు. మణిపూర్ లో జరిగింది మత కల్లోలమా.. తెగల కొట్లాట షర్మిల గారూ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.