spot_img
Homeఎంటర్టైన్మెంట్Netflix: భారత్ లో డిస్నీ+, అమెజాన్ ప్రైమ్ ను ఆదరించినంతగా ‘నెట్ ఫ్లిక్స్’ను ఎందుకు వినియోగించడం...

Netflix: భారత్ లో డిస్నీ+, అమెజాన్ ప్రైమ్ ను ఆదరించినంతగా ‘నెట్ ఫ్లిక్స్’ను ఎందుకు వినియోగించడం లేదు..?

Netflix: కరోనా పుణ్యమాని ఓటీటీల హవా సాగుతోంది. సినిమా థియేటర్లు మూత పడడంతో ప్రజలందరూ ఓటీటీ వేదికకు అలవాటు పడ్డారు. ఈ ప్లాట్ ఫాం పై ఉన్న వివిధ ఛానెళ్ల ద్వారా సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా థియేటర్లలోని జోష్ లేకపోయినా కొందరు కుటుంబ సభ్యులు కలిసి ఇంట్లోనే థియేటర్ ఏర్పాటు చేసుకొని సినిమాలు చూస్తున్నారు. భారత్లో ఓటీటీ అతి తక్కువ కాలంలోనే విస్తరించింది. అయితే ఇందులోని కొన్ని ఛానెళ్లు మాత్రమే దూసుకుపోతున్నాయి. అమెజాన్, డిస్నీహాట్ స్టార్ లాంటి ఛానళ్లు టాప్ ప్లేసులో ఉన్నాయి. అయితే ప్రముఖ ఛానెల్ ‘నెట్ ఫ్లిక్స్’ మాత్రం జనం ఆదరించలేకపోతున్నారు. వరల్డ్ వైడ్ గా నెట్ ఫ్లిక్ష్ సబ్ స్క్రైబర్లు కోట్ల మంది ఉన్నారు. కానీ భారత్ కు వచ్చే సరికి దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.

2018 ఫిబ్రవరిలో జరిగిన ఓ సమావేశంలో నెట్ ఫ్లిక్స్ కు 10 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని ఆ సంస్థ సీఈఓ రీడ్ హేస్టింగ్స్ అన్నారు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఆ దూకుడు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లలో నెట్ ఫ్లిక్స్ ను ఆదరిస్తున్నా భారత్లో మాత్రం వెనకబడిపోతుందని గత వారం ఓ ఇన్వెస్టర్ కాల్ లో హేస్టింగ్స్ వాపోయారు. భారత్లో 2 మిలియన్ డాలర్ల స్ట్రీమింగ్ మార్కెట్ తయారైందని మీడియా పార్ట్ నర్స్ ఆసియా తెలిపింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ప్రస్తుతం ఓటీటీ లెక్కల ప్రకారం భారత్లో డిస్నీ హాట్ స్టార్ 4.6 కోట్ల స్క్రైబర్లు ఉంటే ఆమెజాన్ ప్రైమ్ వీడియోకు 1.9 కోట్లు ఉన్నారు. అదే నెట్ ఫ్లిక్స్ కు మాత్రం కేవలం 55 లక్షలు మాత్రమే ఉన్నారు. ఇండియాలో 2018లో ప్రారంభమైన నెట్ ఫ్లిక్స్ ఆ తరువాత హిందీ చలనచిత్రాలతో ప్రభంజనం సృష్టించింది. ఈ సంస్థ తొలి ఒరిజినల్ సిరీస్ అందించిందంటూ ది ఎకనామిక్స్ మ్యాగజైన్ పేర్కొంది. కానీ పరిస్థితులు వేరేలా మారుతున్నాయి. ఇండియాలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా పెద్దది. దేశంలో చాలా మందికి కేబుల్ కనెక్షన్ల ద్వారా తక్కువ ధరలో చానెళ్లు లభ్యమవుతాయి. అలాంటప్పుడు వీరు అన్ని రకాల వీడియోలు వచ్చే కేబుల్ టీవీనే ఎక్కువగా ఆదరిస్తారు.

అయితే నెట్ ప్లిక్స్ ఇప్పటికీ మిగతా ఛానెళ్ల కంటే ఎక్కువ ఖర్చుతో సినిమాలను అందిస్తోంది. దీంతో వినియోగదారులు తక్కువ ధరకు లభించే వాటిపై మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో డిస్నీ ప్లస్ ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటోంది. భారత ప్రజల అభిరుచులను తెలుసుకొని వారికి అనుగుణంగా సినిమాలను అందిస్తోంది. ప్రధానంగా డిస్నీ ప్లన్ స్పోర్ట్స్ ను ఎక్కువగా ప్రసారం చేస్తోంది. ఐపీఎల్ టోర్నీతో సహా ప్రపంచకప్ లను అందిస్తూ పెద్ద పెద్ద డిజిటల్ ప్రసార హక్కులను కొనుగోలు చేస్తోంది.

మరో ఓటీటీ సంస్థ ఆమెజాన్ ప్రాంతీయ భాషల్లో సినిమాలను అందుబాటులో ఉంచుతోంది. దేశంలో 10 భాషల్లో సినిమాలను, సిరీసులను అందిస్తోంది. గతేడాది విడుదలైన ‘ఫ్యామిలీ మాన్’ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందుకు ప్రాంతీయ భాషల్లో విడుదల చేయడమే కారణంగా పేర్కొంటున్నారు. భారత్లో విడుదలయ్యే 40 శాతం సినిమాలు అమెజాన్ హక్కులు సాధిస్తోంది. దీంతో వినియోగదారులు ఎక్కువగా ఆమెజాన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

నెట్ ఫ్లిక్స్ కూడా భారత్లో ఇమేజ్ కోసం అత్యదిక డాలర్లను వెచ్చించింది. సినిమాలు, సిరీస్ ల కోసం ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది. కానీ స్ట్రీమింగ్ షో లు నిర్వహించడంలోనూ.. ప్రాంతీయ భాషల్లో సినిమాలను విడుదల చేయడంలో విఫలమైందని మీడియా పార్ట్ నర్స్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ మిహిర్ షా తెలిపారు. అదే మిగతా వాటికంటే నెట్ ఫ్లిక్స్ భారత్ లో విఫలం కావడానికి కారణమంటున్నారు.

అందుకే తాజాగా నెట్ ఫ్లిక్స్ తేరుకుంది. టాటా గ్రూప్ తో టై అప్ అయ్యింది. ‘టాటా స్కై’ నుంచి టా ప్లేగా మార్చి నెట్ ఫ్లిక్స్ ఉచితంగా అందిస్తున్నారు. టాటా ప్లేతో కలిసి భారతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు నెట్ ఫ్లిక్స్ ఇలా ఉచిత ప్రసారాలకు సిద్ధమైంది. మరి ఈ ఎత్తుగడ పనిచేస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper