ATA : ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవం.. అని రాయప్రోలు సుబ్బారావు రాశారు కదా.. ఆ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వారు. ఆటా 18వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ ను ఈ ఏడాది జూన్ ఏడు నుంచి 9 వరకు అట్లాంటాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆటా నిర్వాహకులు పలు నగరాలలో నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నృత్య పోటీలకు సయ్యంది నాదం అని పేరు పెట్టారు. సిరిసిరిమువ్వ సినిమాలోని “ఝుమ్మంది నాదం.. సయ్యంది పాదం” అనే పాటను ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమానికి అలా పేరు పెట్టారు.
సయ్యంది పాదం కార్యక్రమాన్ని “కాలు కదుపుదాం.. ప్రైజ్ గెలుద్దాం” అనే థీమ్ తో నృత్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను అమెరికాలోని లాస్ ఏంజిల్స్, నాష్ విల్, రాలీ, అట్లాంటా, డల్లాస్, న్యూ జెర్సీ, ఆస్టిన్, చికాగో, షార్లెట్, వాషింగ్టన్ డిసి, ఫిలడెల్ఫియా వంటి ప్రాంతాలలో నిర్వహించారు. ఇంకా పలు ప్రాంతాలలో ఈ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఊరిలో ఈ పోటీలు నిర్వహించాలని నిర్వాహకులు సంకల్పంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు జరిగిన పోటీలలో వేలాది మంది కళాకారులు పాల్గొన్నారు. ఏడు నుంచి 13 సంవత్సరాల వారిని జూనియర్, 14 నుంచి ఆపై వారిని సీనియర్లుగా విభజించారు. క్లాసికల్, నాన్ క్లాసికల్, సోలో, గ్రూప్ వంటి విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన వారికి నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందించారు. అంతేకాదు ఆటా కన్వెన్షన్ ఫైనల్స్ లో పాల్గొనే అవకాశం కూడా కల్పించారు. టికెట్లు కూడా ఉచితంగా ఇచ్చారు.
పోటీలు నిర్వహించిన ప్రతి ప్రాంతంలో వచ్చిన కళాకారులకు, వారితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులకు టీ, కాఫీ, తాగునీరు, స్నాక్స్, పండ్లు ఇచ్చారు. ఆటా అధ్యక్షులు బొమ్మ కంటి మధు, కన్వీనర్ పాశం కిరణ్, కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ బొద్దిరెడ్డి అనిల్, నేషనల్ కోఆర్డినేటర్ సూదిని సాయి, కో కన్వీనర్ ఆసిరెడ్డి ప్రశాంతి, కో – కోఆర్డినేటర్ గూకంటి ప్రశీల్, కో డైరెక్టర్ శ్రీరామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పోటీలు కనివిని ఎరుగని స్థాయిలో జరిగాయి. అమెరికా చరిత్రలో వేలాదిమంది ఈ పోటీలకు హాజరయ్యారు.. ఈ కార్యక్రమ పూర్తి వివరాలకు www. Aata conference.org ని సందర్శించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఈ పోటీల కార్యక్రమాన్ని చైర్ చిట్టూరి శృతి విజయవంతంగా నడిపించారు. అడ్వైజర్ కాకర్ల రాజు, కో చైర్ అడబాల చిట్టి పోటీలను దగ్గరుండి జరిపించారు. పోటీలు ఏర్పాటు చేసిన ప్రతి ప్రాంతంలో తెలుగు సంస్కృతి ప్రతిబింబించే విధంగా భోజనాలు ఏర్పాటు చేశారు. అట్లాంటాలో సందీప్ రెడ్డి నీలిమ గడ్డమణుగు, దేవనూరి కిషన్, ఈటూరి ఉదయ, రాచకుల శ్రావణి, దాస్యం మాధవి, జయచంద్ర రెడ్డి, పొద్దుటూరి నిరంజన్, కాసం గణేష్, చామల శృతి, కంచర్ల రాధా, ఎర్రబెల్లి కీర్తి, చీకటి అజిత, రత్నావత్ పవిత్ర, కల్వకుంట్ల శాలిని, కటిక శ్రీదేవి, త్రిపురారి రజని, రామకృష్ణారెడ్డి అల, గూడూరు కిషోర్, నూకల నరేంద్ర, చండ సుశీల్, నూకల క్రిష్, రాచకొండ సాయిరాం, నూకల లావణ్య, చండ బిందు మాధవి, సబ్బసాని వెంకట రంగారెడ్డి, ఏళ్ల క్రాంతి, నూకల సునీత.. పలు ప్రాంతాలలో పోటీలు విజయవంతంగా సాగేందుకు వీరంతా కృషి చేశారు. నిర్వహించిన అన్ని ప్రాంతాలలో పోటీలు అద్భుతంగా సాగడంతో నిర్వాహకులు స్పాన్సర్లకు, న్యాయ నిర్ణేతకు, బృంద సభ్యులకు వలంటీర్లకు, ఫోటో, వీడియో గ్రాఫర్లకు డీజే, వెన్యూ రెస్టారెంట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.