Homeప్రవాస భారతీయులుAmerica: మరో మరణం.. అమెరికాలో తెలుగు విద్యార్థి విషాదాంతం

America: మరో మరణం.. అమెరికాలో తెలుగు విద్యార్థి విషాదాంతం

America: అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. కొందరు హత్యకు గురవుతుంటే.. కొందరు ప్రమాదవశాత్తు మృత్యువాతపడుతున్నారు. తాజాగా మరో తెలుగురు విద్యార్థి వాటర్‌ ఫాల్స్‌లో పడి మృతిచెందాడు.

ఏం జరిగిందంటే..
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన గద్దే శ్రీనివాస్‌–శిరీష దంపతులుకు ఇద్దరు సంతానం కూతురు అమెరికాలో ఉంటోంది. ఈ క్రమంలో కొడుకు సాయిసూర్య అవినాష్‌(26) ఉన్నత చదువుల కోసం 2023 జనవరిలో అమెరికా వెళ్లాడు. అక్కడ ఎంఎస్‌ చేస్తున్నాడు.

అక్క ఇంట్లో ఉంటూ…
అక్క ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న సాయిసూర్య అవినాష్‌ చదువుకుంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో అక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి రెండు కుటుంబాలు వాటర్‌ఫాల్స్‌ చూసేందుకు వెళ్లాయి. అక్కడ ప్రమాదవ శాత్తు వాటర్‌ఫాల్స్‌లో పడి సాయిసూర్య అవినాష్‌ మృతిచెందాడు. ఈ ఘటన విషయం తెలుసుకున్న భారత్‌లోని అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular