దేశీయ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 55,766వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 16,594 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.17 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. అమెరికా సూచీలు గురువారం అప్రమత్తంగా కదలాడాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ లోని పరిణామాలు సైతం మదుపర్లను అప్రమత్తం చేస్తున్నాయి.