మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ త్వరలో తెలుగు తెరఫై అరంగేట్రం చేయబోతున్నాడు.ఉప్పెన పేరుకి తగ్గట్టు ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ అచ్చ తెలుగు చిత్రానికి సాన బుచ్చిబాబు దర్శకుడు. అతనికిది దర్శకుడిగా తొలి చిత్రం. అయినప్పటికీ ఇంకా తొలి సినిమా విడుదల కాక ముందే సాన బుచ్చిబాబు పేరు టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతోంది. అగ్ర దర్శకుడు సుకుమార్ దగ్గర చాలా ఏళ్ల పాటు శిష్యరికం చేసిన బుచ్చిబాబు..ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు..
వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ఈ చిత్రం లో నిత్యా శెట్టి అనే కొత్తమ్మాయి హీరోయిన్గా అరంగేట్రం చేస్తోంది..ఈ సినిమా మొదలైనపుడు ఎవరికీ పెద్ద అంచనాలు లేవు. కానీ.. ఇప్పుడు మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఇందుక్కారణం మొదట్నుంచి చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్న ప్రోమోలే. ఉప్పెన అనే టైటిల్ పెట్టి దాన్ని డిజైన్ చేసిన తీరుతోనే బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు.ఆ .తర్వాత హీరో హీరోయిన్ల ప్రి లుక్ పోస్టర్లతో అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
ఈ చిత్రం యొక్క ప్రతి పోస్టర్ ప్రేక్షకులకు పాజిటివ్ ఫీల్ ఇస్తోంది. ఇక నీ కన్ను నీలి సముద్రం అంటూ తొలి పాట వచ్చాక ఉప్పెనపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ పాట ఇన్స్టంట్ హిట్టయింది. అందులో విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా అనిపించాయి. తాజాగా రిలీజ్ చేసిన ధక్ ధక్ ధక్ పాటలో ప్రతి షాట్, ప్రతి విజువల్ దర్శకుడి అభిరుచిని చాటుతోంది.సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ తన మొనాటనస్ ట్యూన్స్ అన్నీ పక్కన పెట్టి సహజ శబ్దాల్ని ఉపయోగించుకుంటూ ఈ పాటను ట్యూన్ చేసాడు. దానికి తోడు చక్కటి లిరిక్స్, విజువల్స్ అన్నీ తోడై ఈ పాటని ఇన్ స్టాన్ట్ హిట్ చేశాయి.
మొత్తం మీద సాన బుచ్చిబాబు ఒక ప్రేమ కావ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడని పిస్తోంది ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోల్ని చూస్తే. హీరో, హీరోయిన్ లపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం కానీ..దర్శకుడిగా తన అభిరుచిని చాటు కున్నాడు సాన బుచ్చిబాబు. ఈ ఊహాగానాలన్నిటికి తెర పడాలంటే ఏప్రిల్ 2 వ తారీకు దాకా మనం ఆగాలి.
First impression is best impression