
తెలంగాణలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గినట్లు తెలుస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,015 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,54,666 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,393గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,35,950 మంది కోలుకోగా ప్రస్తుతం 17,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 14,694 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. కాగా తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 47,70,004 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.