కర్టాటకలోని మాజీ మంత్రి కిడ్నాప్ నకు గురయ్యారు. కిడ్నాపర్లు నగదు డిమాండ్ చేయడంతో వాటిని చెల్లించి ఆయన బయటపడ్డారు. అయితే మంగళవారం ఆయన పోలీసులను ఆశ్రయించడంతో వివరాలు బయటికి వచ్చాయి. బెంగుళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. .మాజీ మంత్రి వర్తూర్ ప్రకాశ్, ఆయన డ్రైవర్ తో కలిసి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని తన ఫాం హౌజ్ కు వెళ్లినప్పుడు ఈనెల 25న కిడ్నాప్ చేశారు. ఆ తరువాత కిడ్నాపర్లు ప్రకాశ్ ను రూ.30 కోట్ల డిమాండ్ చేశారు. ఆ తరువాత మాజీ మంత్రి రూ.48 లక్షలు చెల్లించడంతో బెంగుళూర్లోని హోస్కోట్ లో 28న విడుదల చేశారు. కిడ్నాప్ లో 8 మంది పాల్గొన్నట్లు ప్రకాశ్ తెలిపారని పోలీసులు పేర్కన్నారు. కర్ణాటకలోని కోలార్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వర్తూర్ ప్రకాశ్ 2012 నుంచి 2013 వరకు కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2017లో సొంతంగా నమ్మా కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. అయితే 2018 ఎన్నికల్లో కె.శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. కాగా వర్తూర్ ప్రకాశ్ కు