
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 54,044 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 76,51,108 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 717 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,15,914 కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 7,40,090 యాక్టివ్ కేసులు ఉండగా.. 67,95,103 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.