HomeజాతీయంUPI Payments : గూగుల్ పే, ఫోన్ పే వాడే వారందరికి షాక్..రూ.2వేలు దాటితే ఇకపై...

UPI Payments : గూగుల్ పే, ఫోన్ పే వాడే వారందరికి షాక్..రూ.2వేలు దాటితే ఇకపై చార్జీల మోత

UPI Payments : మీరు గూగుల్.. ఫోన్ పే.. వంటివి వాడుతున్నారా..? అడ్డు అదుపు లేకుండా లావాదేవీలు చేస్తున్నారా..? యూపీఐ లావాదేవీలకు అలవాటు పడిపోయారా..? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ లావాదేవీలపై కొంత మొత్తాన్ని వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు వాటిపై అదనపు చార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (npci) చేసిన సిఫార్సులను యధాతథంగా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీన ఆరంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలులోకి రానుంది.

కీలక సర్కులర్ జారీ..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (upi) ద్వారా ఆర్థిక, వ్యాపార లావాదేవీల పై అదనపు చార్జీలను వసూలు చేయాలంటూ ఎన్సీపీఐ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు ఓ సర్కులర్ ను జారీ చేసింది ఆ సంస్థ. దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా వినియోగదారులు జరిపే బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీలు, నగదు చెల్లింపులు అన్నింటి పైన ఈ అదనపు చార్జీలు వసూలు చేయాలని సూచించింది.

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు..

ఈ తరహా ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీలు, చెల్లింపులపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) చార్జీలను వసూలు చేయాలని సిఫార్సు చేసింది. దీన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని పేర్కొంది. దీనికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్సిపిఐ చేసిన సిఫార్సులను యథాతదంగా అమలు చేయడానికి కేంద్రం అంగీకరించినట్లు సమాచారం.

2000 దాటితే చార్జీలు తప్పు..

ఎన్సీపీఐ జారీ చేసిన సర్కులర్ ప్రకారం యూపీఐ ద్వారా 2000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసిన వినియోగదారులపై 1.1 శాతం అదనపు చార్జీలను ఎన్సిపిఐ వసూలు చేస్తుంది. చార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ను జారీ చేసిన వారు రెమిటర్ బ్యాంకుకు వాలెట్ – లోడింగ్ సర్వీస్ ఛార్జ్ గా సుమారు 15 బేసిస్ పాయింట్లను చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర రంగాల అభివృద్ధికి ఖర్చు..

బ్యాంకు ఖాతా, పిపిఐ వాలెట్ మధ్య పీర్ – టు – పీర్ – మర్చంట్ (P2PM) లావాదేవీలు పరంగా ఎలాంటి చార్జీలు ఉండవు. ఇలా యూపీఐ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇతర రంగాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనుంది. ఇందులో ఇంధనం -0.5 శాతం, టెలికం, యుటిలిటీస్/పోస్టాఫీస్, విద్య, వ్యవసాయానికి – 0.9 శాతం, మ్యుచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, రైల్వేలకు ఒక శాతాన్ని బదలాయిస్తుంది.

సెప్టెంబర్ నెలలో దీనిపై సమీక్ష..

ఈ ఆదనపు చార్జీల వసూలు పై సెప్టెంబర్ 30వ తేదీన ఎన్సిపిఐ సమీక్ష నిర్వహిస్తుంది. దీన్ని మున్ముందు అమలు చేయాలా..? వద్దా..? లేక అదనపు చార్జీలను మరింత పెంచాలా..? లేక తగ్గించాలా..? అదనపు చార్జీల పరిధి మొత్తం వంటి అంశాలను సమీక్షించనుంది. ఎన్సిపిఐ ద్వారా ఈ ఏడాది జనవరిలో 12.98 లక్షల కోట్లు రూపాయలు ఆర్థిక లావాదేవీలు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 12.36 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్సిపిఐ దీనికి సంబంధించి పునరాలోచన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular