కాజల్ అగర్వాల్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ భర్తతో కలిసి పుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయిన సంగతి తెల్సిందే..!
Also Read: హనీమూన్ లోనూ కాజల్ సంపాదన ఆగట్లేదు !
కాజల్ హనీమూన్ పిక్స్ చూసిన కొందరు అభిమానులు ఖుషీ అవుతుండగా మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తూ పదేపదే ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ తన హనీమూన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. కొన్నివారాలపాటు మాల్దీవుల్లో గడిపిన కాజల్ జంట హనీమూన్ కోసం ఏకంగా 40లక్షలకు పైగా ఖర్చుచేసినట్లు సమాచారం.
Also Read: వైరల్.. కాబోయే భర్తతో మెగా డాటర్ ఏం చేసిందంటే?
భూతల స్వర్గంగా పేరొందిన మాల్దీవుల్లో కాజల్-గౌతమ్ జంట అక్కడి బీచుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసిన సంగతి తెల్సిందే. అలాగే అండర్ వాటర్లో భర్తతో కలిసి కాజల్ దిగిన ఫొటోలు కూడా అభిమానులను మెస్మరైజ్ చేశాయి. హనీమూన్ కోసం ఈ జంట ఓ ప్రైవేట్ రెస్టారెంట్ ను వారంపాటు అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
కాజల్ అగర్వాల్ తన హనీమూన్ రిచ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మాల్డీవుల్లో ఖర్చుకు ఏమాత్రం వెనుకలేదని తెలుస్తోంది. దీంతో కాజల్ హనీమూన్ అక్కడి వ్యాపారులకు మనీమూన్ గా మారిందని తెలుస్తోంది. కాజల్ హానీమూన్ కోసం భారీ ఖర్చు చేయడంపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది. కోట్ల రూపాయలు సంపాదించే కాజల్ హనీమూన్ కోసం ఆమాత్రం ఖర్చు పెట్టడం పెద్ద విషయమేమీ కాదని పలువురు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.