కాలాలతో సంబంధం లేకుండా మనకు ప్రతి కాలంలో లభించే పండ్లలో ద్రాక్ష పండ్లు ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ద్రాక్ష పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆసియా ప్రాంతంలో ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచే ద్రాక్ష పండ్ల సాగు జరుగుతోంది. ద్రాక్ష పండ్లను వైన్ తయారీ కోసం ఎక్కువగా వినియోగిస్తారు. ద్రాక్ష పండ్లను రోజూ తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
Also Read: మిర్చీ తినడం హెల్త్ కు మంచిదేనా.. సర్వేలో షాకింగ్ విషయాలు..?
అజీర్ణం సమస్యతో బాధ పడే వాళ్లు ద్రాక్ష పండ్లు తింటే ఆ సమస్య దూరమవుతుంది. ద్రాక్ష పండ్లు ఆస్తమా సమస్యతో బాధ పడే వాళ్లకు ఆ సమస్యను సులువుగా దూరం చేస్తాయి. మద్యాన్నికి బానిసైన వాళ్లు ద్రాక్ష పండ్ల రసం తీసుకుంటే ద్రాక్షలో ఉండే పొటాషియం రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు ఆల్కహాల్ పై ఆసక్తిని క్రమంగా తగ్గిస్తుంది. రోజూ ద్రాక్ష రసం తాగే వాళ్లను దంత సంబంధిత సమస్యలు వేధించవు.
కురుపులతో బాధ పడుతూ ఉంటే ద్రాక్ష రసం ద్వారా ఆ కురుపులను చాలా తక్కువ సమయంలోనే తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ద్రాక్ష కిడ్నీల్లోని రాళ్ల సమస్యను కూడా దూరం చేస్తుంది. మైగ్రేన్ సమస్యతో బాధ పడేవాళ్లకు ఆ సమస్యను దూరం చేయడంలో ద్రాక్ష రసం సహాయపడుతుంది. ద్రాక్షలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ద్రాక్ష తీసుకునే వాళ్లలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
Also Read: కరోనా విషయంలో శుభవార్త… వ్యాక్సిన్ అవసరమే లేదట..?
ద్రాక్ష చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ బారిన పడకుండా ద్రాక్ష రక్షిస్తుంది. ద్రాక్ష గుండెకు బలాన్ని చేకూర్చడంతో పాటు హృదయ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More