
కేంద్ర రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డీఎస్ఎస్సీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 83 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం డీఎస్ఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్టెనో, ఎల్డీసీ, సివిల్ మోటార్, ఎంటీసీ, ఇతర పోస్టులు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 22వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారు తమిళనాడు రాష్ట్రంలో పని చేయాల్సి ఉంటుంది. http://dssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 83 పోస్టులలో మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 60 ఉండగా లోయర్ డివిజన్ క్లర్క్ 10, సివిలియన్ మోటార్ డ్రైవర్ 7, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 4, సుఖాని ఉద్యోగ ఖాళీలు 1, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి.
పదో తరగతి, ఐటీఐ, ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగనుండగా దరఖాస్తుల్లో పేర్కొన్న విద్యార్హతల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను రాతపరీక్షకు ఆహ్వానించడం జరుగుతుంది. రాతపరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ స్పెసిఫిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయని సమాచారం.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి 18000 రూపాయల నుంచి 81100 రూపాయల వరకు వేతనం లభించనుంది.