Homeఅత్యంత ప్రజాదరణముక్కోటి ఏకాదశి రోజు ఆ విష్ణు భగవానుని ఎందుకు పూజిస్తారో తెలుసా?

ముక్కోటి ఏకాదశి రోజు ఆ విష్ణు భగవానుని ఎందుకు పూజిస్తారో తెలుసా?

Mukkoti Ekadashi

తెలుగు మాసాలలో కెల్లా మార్గశిరమాసం శ్రీమన్నారాయణకి ఎంతో పవిత్రమైనదని చెప్పవచ్చు.ఈ మార్గశిర మాసం మధ్యలో ధనుర్మాసం మొదలవడంతో ఈ నెలలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు ఉంటే అవన్నీ ఎంతో పవిత్రమైనవి ఈ ఏకాదశలన్ని చంద్రమానం ప్రకారం లెక్కిస్తే,ఈ ముక్కోటి ఏకాదశి మాత్రం సౌరమానం ప్రకారం లెక్కిస్తారు. ఈ సౌర మానంలో సూర్యుడు ఉత్తరాయణనికి ప్రవేశిస్తాడు.

Also Read: కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం జరుగుతుంది!

ఈ విధంగా సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశించే ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠ ద్వారాలు తెరవటం వల్ల ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున సముద్రంలో పవళించిన విష్ణుదేవుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఆవిధంగా మేల్కొన్న ఆ విష్ణుమూర్తిని కలవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకుంటారు.

Also Read: మంగళవారం చేయకూడని పనులు ఏమిటో తెలుసా?

ఆ విధంగా ముక్కోటి దేవతలు వైకుంఠములో కొలువై ఉండటం వల్ల ఆ రోజు విష్ణు ఆలయాలను ఉత్తరద్వారం గుండా వెళ్లి ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని భావిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఈ ఏకాదశి రోజు వైకుంఠానికి తలుపులు తెరచి ఉండడం వల్ల ఈ రోజు మరణించిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మన్నారాయణుని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular