భాద్రపద మాసం పూర్తయిన తర్వాత, ఆశ్వయుజ మాసం తొలి రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవడంతో ఎంతోమంది భక్తులకు పండగ వాతావరణం సంతరించుకుంటాయి. నవరాత్రుల లో భాగంగా అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే శుక్రవారం నుంచి దేవీ నవరాత్రులు మొదలవడంతో భక్తులందరూ పెద్దఎత్తున దేవాలయాలను దర్శించడంతో, ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవీ నవరాత్రుల లో భాగంగా ఈ రోజు రెండవ రోజు కనుక అమ్మవారు బ్రహ్మచారిణి దేవి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అయితే ఈ అవతారంలో అమ్మవారికి ఏవిధంగా పూజలు నిర్వహించాలి, ఎటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
నవరాత్రులలో రెండవ రోజు కనుక బ్రహ్మచారిని అవతారంలో అమ్మవారు ఆలయాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మొదటి అవతారం లో శైలపుత్రి గా తపస్సు చేసి శివుడిని వివాహమాడాలని ఉద్దేశంతో బ్రహ్మచారిణి గా తపస్సు చేస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మచారిణి దేవత బాల రూపంలో విజయవాడలో దర్శనమిస్తుంటారు. బాల రూపంలో బండాసురుడు రాక్షసుల సంహరణ జరిగింది. బండాసురుడు తన 30 మంది పుత్రులను దేవి సైన్యం మీద యుద్ధానికి పంపుతాడు. దీంతో అమ్మవారు పిల్ల వాళ్ళతో యుద్ధానికి పెద్దవారు అవసరం లేదని తన దగ్గరున్న శ్రీ శక్తి సైన్యంతో బాల అనే ఒక రూపాన్ని ఉద్భవిస్తుంది. ఈ బాల బండాసురల 30 మంది పుత్రులను సంహరిస్తుంది. ఈ విధంగా బ్రహ్మచారిని దేవత బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ లో దర్శనమిస్తారు.
బాల త్రిపుర సుందరి దేవిని పూజించేటప్పుడు ఆకుపచ్చని రంగు దుస్తులతో దర్శనమిస్తారు. బాల అంటే చిన్న పిల్లలు కనుక చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడి తినేది పెరుగన్నం కాబట్టి, ఈ బాల త్రిపుర సుందరి దేవి కి నైవేద్యంగా పెరుగన్నం సమర్పించడం ద్వారా ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద కలుగుతుంది. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళి గా వదలడమే కాకుండా, దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది అని భక్తుల నమ్మకం.