
Rohit Sharma IND vs AUS : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 9వ శతకం బాదాడు. కీలకమైన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ సాధించి ఘనత సాధించారు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో తొలి టెస్టు సెంచరీ అదీ కెప్టెన్ హోదాలో రోహిత్ చేయడం విశేషం.
2021లో ఇంగ్లండ్ పై చివరిసారిగా రోహిత్ సెంచరీ చేశారు. బౌలింగ్ కు అనుకూలమైన నాగపూర్ పిచ్ పై అందరూ తక్కువ పరుగులకే ఔట్ అయిన వేళ రోహిత్ ఒక్కడే నిలబడి సెంచరీ కొట్టడం విశేషం. అటు ఆస్ట్రేలియా, ఇటు ఇండియన్ బ్యాట్స్ మెన్ ఎవరూ కూడా పరుగులు చేయడానికి ఈ పిచ్ పై తడబడుతుంటే మన హిట్ మ్యాన్ మాత్రం ఈజీగా ఆడేస్తున్నాడు.
ఆస్ట్రేలియాపై కెప్టెన్ గా తొలి సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20, వన్డే, టెస్టు మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఏకైక భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా పాక్ కెప్టెన్ బాబర్ అజాం, ఫాఫ్ డుప్లెసిస్, తిరకరత్నే దిల్షాన్ మాత్రమే ఇంతకుముందు ఈ ఫీట్ సాధించారు. వారి సరసన రోహిత్ నిలిచాడు.
ప్రస్తుతం ఈ మూడు ఫార్మాట్లకు కలిపి రోహిత్ శర్మ 43 శతకాలను పూర్తి చేశాడు. ఇందులో టెస్టుల్లో 9, వన్డేల్లో 30, టీ20ల్లో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (42) సెంచరీల రికార్డును అధిగమించాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.