Homeలైఫ్ స్టైల్Gram Ujala Yojana:  మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. రూ.50కే మూడేళ్ల వారంటీతో ఐదు బల్బులు!

Gram Ujala Yojana:  మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. రూ.50కే మూడేళ్ల వారంటీతో ఐదు బల్బులు!

Gram Ujala Yojana:  పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో గ్రామ్ ఉజాలా పథకం కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాలలో వెలుగులు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ అమలులో భాగంగా కేంద్రం 10 రూపాయలకే ఎల్ఈడీ బల్బులను అందజేస్తున్న సంగతి తెలిసిందే.

Gram Ujala Yojana
Gram Ujala Yojana

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 50 లక్షలకు పైగా ఎల్ఈడీ బల్బులను అందజేసింది. కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అనే ప్రభుత్వ కంపెనీ ఈ విషయాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ లో భాగంగా కేవలం 10 రూపాయలకే ఎల్.ఈ.డీ బల్బుల పంపిణీ జరగనుంది.

Also Read:  మోహన్ బాబుకు రాజభవనాన్ని తలపించే ఇల్లు.. మంచు లక్ష్మీ వీడియో వైరల్!

కేంద్ర ప్రభుత్వం ఈ బల్బులను 7 వాట్స్, 12 వాట్స్ తో 10 రూపాయలకు మూడు సంవత్సరాల గ్యారంటీతో అందిస్తోంది. ప్రతి కుటుంబానికి కేంద్రం 5 బల్బులను పంపిణీ చేయనుండటం గమనార్హం. ఎల్.ఈ.డీ బల్బుల ద్వారా కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలను ఆదా చేస్తోంది. 2022 సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఎల్.ఈ.డీ బల్బుల వల్ల కరెంట్ బిల్లులు కూడా తక్కువ మొత్తంలో వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు ద్వారా 71 కోట్ల కంటే ఎక్కువ మొత్తం విద్యుత్ ను పొదుపు చేస్తుండటం గమనార్హం. మోదీ సర్కార్ అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

Also Read: మూవీ టికెట్స్ ధరలు.. ఏపీలో వాత.. తెలంగాణలో మోత..?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular