
Groundnut : మనం వంటల్లో విరివిగా వాడే వస్తువులు ఉన్నాయి. అందులో పల్లీలు కూడా ఒకటి. ఇవి బలమైన ఆహారం. ఇందులో ఉండే పోషకాలతో మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ కొంతమంది ఇవి తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయనే అపోహతో దూరంగా ఉంటారు. కానీ పల్లీలు మనకు అత్యంత ఉపయోగకరమైన ఆహారమే. పేద వాడి జీడిపప్పుగా దీన్ని పిలుస్తారు. ఎందుకంటే చౌకగా లభిస్తుంది బలంగా ఉంటుంది. అందుకే దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

వంద గ్రాముల..
వంద గ్రాముల పల్లీలు తీసుకుంటే 567 కేలరీల శక్తి, 17 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 25 గ్రాముల ప్రొటీన్లు, 45 గ్రాముల గుడ్ కొలెస్ట్రాల్, 10 గ్రాముల ఫైబర్, 90 మైక్రో గ్రాముల పొలిక్ యాసిడ్ లు ఉంటాయి. ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఉండదు. అందుకే గుండె జబ్బుల ముప్పు ఉండదు. ఇది పరిశోధనల ద్వారానే రుజువు చేయబడింది. అయితే ప్రస్తుత తరుణంలో చాలా మంది పల్లీలు తింటే గుండెపోటు వస్తుందనే ఉద్దేశంతో తినడం మానేశారు. వీటిని తినడం వల్ల మనకు మేలు కలుగుతుంది కానీ కీడు మాత్రం రాదు.
ఆరోగ్యవంతమైన కొవ్వు
పల్లీల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు మాత్రమే ఉంటుంది. కీడు చేసే కొవ్వు ఏ మాత్రం ఉండదు. పల్లీల్లో ఉండే ఫైటో స్టిరాల్ మన ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ ను రక్తంలో కలవనీయకుండా చేస్తుంది. ఇందులో ఉండే రసాయన సమ్మేళనాలు కాలేయంలో ఉండే మలినాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రొటీన్లు సరిగా అందని వారికి, వ్యాయామాలు చేసే వారికి పల్లీలు ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి దేహ దారుఢ్యం కలుగుతుందని చెబుతున్నారు.
ఆడవాళ్లకు..
గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వ్యాయామాలు చేసేవారు, ఆటగాళ్లు అందరు పల్లీలు ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీంతో మంచి కొవ్వు పెరుగుతుంది. చెడు కొవ్వు నిల్వ లేకుండా చేస్తుంది. వీటిని తగిన విధంగా తీసుకుంటే ఎలాంటి నష్టాలు లేవు. బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటిని తీసుకుంటే మంచిది. ఇందులో రస్వట్రాల్ అనే రసాయన సమ్మేళనం ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో సాయపడుతుంది.
గుండెకు..
గుండెకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు గడ్డ కట్టకుండా చేయడంలో తోడ్పడుతుంది. కూరల్లో మనం మసాలాలు, ఉప్పు, కారం చల్లుకున్నట్లే పల్లీల పొడి చల్లుకుని తినడం వల్ల మంచి లాభాలున్నాయి. నానబెట్టి తీసుకోవడం వల్ల మనకు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలున్న పల్లీలను కావాలనే దూరం చేసుకుంటున్నారు. ఫలితంగా అనారోగ్యాలకు దగ్గరవుతున్నారు. పల్లీలను నూనెలో వేయించకుండా డైరెక్టుగా తింటేనే మంచిది.