Homeఎడ్యుకేషన్Jobs: ఇంటర్ అర్హతతో రూ. లక్షకుపైగా వేతనంతో జాబ్స్.. ఎలా పొందాలంటే?

Jobs: ఇంటర్ అర్హతతో రూ. లక్షకుపైగా వేతనంతో జాబ్స్.. ఎలా పొందాలంటే?

Jobs: ఏపీలోని కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఆఫీసర్, ఎపిడెమాలజిస్ట్, ఓటీ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులతో పాటు స్పెషల్ ఎంవో, డెంటల్ టెక్నీషియన్, అప్థోమెట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 12,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వేతనం లభించనుంది. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ, ఎంఏ, పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్, డిప్లొమా లేదా ఇంటర్, ఓటీ టెక్నాలజీ కోర్సు, డెంటల్ టెక్నీషియన్ కోర్సు, పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు.

2022 సంవత్సరం జులై 1వ తేదీనాటికి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సాంకేతిక పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, అకడమిక్ మెరిట్, విద్యార్హత ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తుకు చివరి తేదీగా ఉంది.

జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఇతర అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

2 COMMENTS

  1. […] AP Politics: అధికార వైసీపీలో ఎప్ప‌టి నుంచో అంత‌ర్గ‌త పోరు సాగుతోంది. అయితే ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ.. లేదంటే ఎమ్మెల్యే వ‌ర్సెస్ మంత్రి అన్న‌ట్టు కుమ్ములాట‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా పెద‌కాకాని మ‌ల్ల‌న్న స‌న్నిధి సాక్షిగా మంత్రి, ఎమ్మెల్యే మ‌ధ్య అగ్గి రాజుకుంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస రావు పెద‌కాకాని మ‌ల్ల‌న్న ఆల‌య ఖాతాను మ‌ళ్లించుకున్న‌ట్టు ఎమ్మెల్యే రోశ‌య్య ఆరోపిస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular