ప్రపంచంలోనే అత్యంత చెత్త వ్యాక్సిన్ పాలసీ అవార్డు భారత దేశానికి దక్కుతుందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ట్విట్టర్ ద్వారా ఎంపీ స్పందిస్తూ ప్రభుత్వం కావాల్సినన్ని డోసులకు ఆర్డర్ ఇవ్వలేదన్నారు. దేశంలో కేవలం రెండు శాతం జనాభా మాత్రమే రెండు వ్యాక్సిన్ డోసులను పొందారన్నారు. వ్యాక్సిన్లకు రాష్ట్రాలు బలవంతంగా అధిక ధరలను చెల్లించాల్సి వస్తుందన్నారు.