
మజీ మంత్రి ఈటలపై రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల సొంత పార్టీ వారినే ఇబ్బందులకు గురి చేశారని ఆయన వ్యాఖ్యనించారు. సీఎం కేసీఆర్ ఈటలను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదన్నారు. బీసీలకు సీఎం సముచిత స్థానం కల్పించారని చెప్పారు. అసైన్డ్ భూములు కొనరాదని తెలిసికూడా తెలియనట్లు వ్యవహరించడం సమంజసం కాదని సూచించారు. తమ నాయకుడు ఆదేశిస్తే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని లక్ష్మీకాంతరావు తెలిపారు.