లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మినహాయింపు ఇచ్చిన టైంలోనే ప్రజలు బయటికి రావాలన్నారు. గూడ్స్ వెహికిల్స్ రాత్రి మాత్రమే తిరగాలని, చెక్ పోస్ట్ ల వద్ద గూడ్స్ వాహనాల కోసం తనిఖీలు ఉంటాయని సజ్జనార్ తెలిపారు. మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ 12వ రోజుకు చేరుకుంది. ఆదివారం కావడంతో మినహయింపు సమయాల్లో నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.