
పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని.. సమగ్ర అఫిడవిట్ మాత్రం ఫైల్ చేయలేమని కేంద్రం తెలియజేసింది. పెగాసస్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని కేంద్రం వాదించింది. అయితే దేశ భద్రత, శాంతిభద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని.. దీనివల్ల పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో చెప్తే చాలని కోర్టు బదులిచ్చింది.