
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవ్యక్తిగా చరిత్ర సృష్టించిన బ్రిటన్ కు చెందిన విలియం షేక్ స్పియర్ (81) అనారోగ్యంతో మృతి చెందారు. గతేడాది డిసెంబర్ 8న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రపంచలోనే మొట్టమొదటి పురుషునిగా షేక్ స్పియర్ వార్తల్లోకెక్కారు. యూనివర్సిటీ ఆస్పత్రి కోవెంట్రీ అండ్ వార్విక్ షైర్ లో ఆయన జర్మనీకి చెందిన బయోఎన్ టెక్, అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకా తీసుకున్నారు.