కృష్ణా జిల్లా నందిగామలో విషాదం చోటుచేసుకుంది. నందిగామ శివారు అనాసాగరం జడ్పీ హైస్కూల్ లో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందాడు. మృతుడు పదో తరగతి చదువుతున్న గోపీచంద్ (15) గా పోలీసులు గుర్తించారు. గోపీచంద్ ను పాఠశాలలోని వాటర్ ట్యాంక్ శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు సూచించారు. వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.