విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం బొజ్యా తండాలో పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తున్న భూక్య సుధాకర్ (28), మాలోత్ యాకుబ్ (40) లు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరి మృతితో తండాలో విషాదం నెలకొంది.