
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ డ్రా అయినా లేదంటే టై అయిన పక్షంలో న్యూజిలాండ్, టీమిండియాలను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శుక్రవారం ఐసీసీ వెబ్ సైట్ లో ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఆట పరిస్థితుల ఆధారంగా మ్యాచ్ డ్రాగా ముగిసినా, లేదంటే టై అయినా కూడా రెండు టీమ్ లను జాయింట్ విన్నర్సగా ప్రకటిస్తామని ఐసీసీ గ్లోబల్ బాడీ తెలిపింది. అంతేకాదు రిజర్వేడే నిబంధనను పక్కన పెట్టేస్తున్నట్లు తెలిపింది.