అక్టోబర్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కు 15 మందితో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. బాబర్ అజమ్ కెప్టెన్ గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్ రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కాగా ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ప్రకటించారు. (బాబర్ అజమ్, (కెప్టెన్), షాదాబ్ ఖాన్, మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైల్ మక్సూద్.