
ఏపీలో గడిచిన 24 గంటల్లో 59,566 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,378 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,16,680 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల పది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,877కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,139 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,702 యాక్టివ్ కేసులున్నాయి.