
తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేక మంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తం లో విరాళాలు అందించారు. ఇప్పటికే సూర్య కార్తీ సోదరులు కోటి విరాళంగా అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య రజనీకాంత్ కోటి రూపాయలు అందించారు. తాజాగా దర్శకుడు శంకర్ రూ. 10 లక్షల రూపాయలను అందించారు. ప్రస్తుతం శంకర్ విశ్వ నటుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రం చెయ్యాల్సి ఉంది. దాని తర్వాత మరో బిగ్గెస్ట్ అండ్ బెంచ్ మార్క్ కాంబో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చెయ్యనున్నారు.