మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈటల రాజేందర్ శుక్రవారం పాదయాత్రలో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.