
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రలను స్థానికులు ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన మర్రిపాడు మండలం బుదవాడ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధితులు కడప జిల్లా గోపవరం మండలం బెడుసునపల్లె వాసులుగా పోలీసులు గుర్తించారు.