హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నగర సీపీ అంజన్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అసత్య ప్రచారాల కారణంగా హైదరాబాద్ లో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకున్నా భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఎన్నికల ప్రచారానికి చాలా మంది వస్తున్నారు. నగరంలో ఏదో జరగబోతుందని ప్రచారం చేస్తున్నారు. మత ఘర్షణలు స్రుష్టించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. అసత్య ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నగరంలో కొన్ని అరాచక శక్తులు మత ఘర్షణలు స్రుష్టించేందుకు యత్నిస్తున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Expose the communal minds trying to disturb the city during these important times of election. They are using social media to spread fake news. Let us join hands to keep city safe and happy. pic.twitter.com/jhqw9kOK5B
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) November 26, 2020