Mamata Banerjee : రాజకీయాల్లో అప్పుడప్పుడు అణువిస్ఫోటనాలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్ లోని టీఎంసీలో 80కి 59 ఎమ్మెల్యేలు బెంగాల్ స్పీకర్ కు ఒక లెటర్ సమర్పించారు. మాదే నిజమైన టీఎంసీ అని.. మా లెజిస్లేటివ్ పార్టీని గుర్తించాలని వినతిపత్రం ఇచ్చారు. ఎంపీలు కూడా తిరుగుబాటు చేశారు.
మమత ఒక కను సైగ చేస్తే టీఎంసీలో భయపడేవారు. అధికారులు పరుగులు పెట్టేవారు. ఆ స్థితి నుంచి ఇప్పుడు మమత పెట్టిన పార్టీనే ఆమె చేతుల్లో లేకుండా పోయింది.
ఎన్నికలు ఫలితాలు వచ్చిన రోజునే గెలిచిన ఎమ్మెల్యేలందరుతో మీటింగ్ పెట్టారు. మే 9న మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ స్పీకర్ సోమన్ దేవ్ ను లెజిస్లేచర్ పార్టీ నేతగా నియమిస్తున్నట్టు లెటర్ రాశాడు. సహజంగానే జరిగేదే.కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే.. సందీపన్ సాహా, బెనర్జీ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు మా సంతకాలు ఫోర్జరీ చేసి స్పీకర్ కు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై సీఐడీ విచారణను స్పీకర్ ఆదేశించారు. దీంతో అభిషేక్ బెనర్జీపై కేసు నమోదైంది.
మమతా బెనర్జీ ఆదివారం మీటింగ్ పెడితే 80కి 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ధర్నా చేస్తే కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. 40కిపైగా టీఎంసీ ఎంపీల్లో కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. 59మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు లెటర్ ఇచ్చారు. నెలరోజుల్లో ఇంత అసంతృప్తి ఎందుకొచ్చింది అన్నది చూస్తే..
తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా ఔట్? ఎందుకయ్యారు.. దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
