కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ఎగువ నుంచి వచ్చే భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరుగుతుండటంతో ఆలయ గోపురం వరకు నీరు చేరింది. ఆలయ పూజారి రఘురామశర్మ శిఖర పూజలు నిర్వహించారు. మరో వైపు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 3,15,576 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 854.80 అడుగులకు చేరింది.