
నగరంలోని ఖానామెట్ లో భూ వేలం పై కేసీఆర్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఖానామెట్ లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్ లో గొల్డెన్ మైల్ లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. దీంతో స్మశానవాటిక వేలాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తాము సెంటిమెంట్ గా భావించే సమాధులను పరిరక్షించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారించిన హైకోర్టు తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.