KCR: కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. ఆయన వెంట కవిత కూడా ఉన్నారు. ఉదయం 11.30 గంటలకు కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకోనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా భవన్ వద్దకు సుమారు 20 వేల మంది బీఆర్ఎస్ శ్రేణులతో పాటు జాగృతి కార్యకర్తలు వస్తారని పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో 2 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.