KCR: కాళేశ్వరం మిషన్ ఎదుట విచారణకు మాజీ సీఎం, భారస అధినేత కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో ఆయన్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వంర ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్లలపై ఆయన్ను విచారిస్తున్నారు. బీఆర్కే భవన్ లోకి వెళ్లేందుకు కేసీఆర్ తో పాటు 9 మంది నేతలకు అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకు 114 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీశ్ రావు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.