
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్ల 1,05,024 మంది నమూనాలు పరీక్షించగా 2,974 కొత్త కేసులు నమోదయ్యాయి. 17 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 3,290 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,708 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది. కొవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు మరణించారు.