
కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను స్వాగతిస్తున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలు డి.కె అరుణ తెలిపారు. ఇన్నాళ్లుగా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్ తో కుమ్మక్కైన కేసీఆర్ దక్షిణ తెలంగాణను విస్మరించారని ఆమె ఓ ప్రకటనలో ఆరోపించారు. పక్క రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు కేఆర్ఎంబీ నిలిపేస్తుందని అరుణ పేర్కొన్నారు.