Homeఆధ్యాత్మికంఅమావాస్య రోజు ఈ ఆలయంలో పూజలు చేస్తే.. ఏళ్లనాటి దరిద్రం మాయం..!

అమావాస్య రోజు ఈ ఆలయంలో పూజలు చేస్తే.. ఏళ్లనాటి దరిద్రం మాయం..!

అమావాస్య అనగానే చాలా మందికి ఒక రకమైన భయం ఉంటుంది. ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేయడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించడానికి ముందుకు రారు. అమావాస్య ముందు, వెనుక రోజుల్లో కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించారు. కానీ ఓ ఆలయంలో అమావాస్య రోజున పూజలు చేయడం వల్ల దరిద్రాలు మాయమవుతాయని కొందరు భక్తులు పేర్కొంటున్నారు. అమావాస్య రోజునే కాకుండా పౌర్ణమి, అష్టమి రోజుల్లో ఇక్కడ పూజలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు, యమగండాలు తొలగిపోతాయని అంటున్నారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే?

కాకతీయుల రాజ్య కేంద్రమైన ఓరుగల్లుకు ఎంతో చరిత్ర ఉంది. వారి కాలంలో అనేక ఆలయాలు నిర్మించారు. పలు ప్రముఖ ఆలయాలకే కేంద్రంగా ఉన్న వరంగల్ నగరంలో 1500 సంవత్సరాల కిందట ఓ ఆలయాన్ని నిర్మించారు. అదే కాలబైరవుడి ఆలయం. నగరంలోని గోవిందరాజుల గుట్ట కింద ఆ స్వామి క్షేత్ర పాలకుడిగా కాలబైరవుడు వెలిశాడు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉండడంతో పాటు భక్తుల బాధలు తీర్చే క్షేత్రంగా మారిందని స్థానికులు అంటున్నారు.

కాలబైరవుడికి ప్రతీ అమావాస్య, అష్టమి, పౌర్ణమి రోజుల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజుల్లో ఆ స్వామిని పూజించడం వల్ల అనేక బాధలు తొలగిపోతాయని నమ్మకం. ఇక్కడ స్వామివారికి గుమ్మడి కాయతో దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని అంటున్నారు. అలాగే యమగండం నుంచి కూడా గట్టెక్కవచ్చని చెబుతున్నారు. వరంగల్ నగరంలోనే ఈ ఆలయం ఉండడం వల్ల ఇక్కడికి వెళ్లడానికి పెద్ద సమస్య ఉండదన చెబుతున్నారు. ఈ ఆయలంలో కాలబైరవుడితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి అమ్మావార్లు కొలువై ఉన్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular