
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్టరాజు వేసిన పిటిషన్ పై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కౌంటర్ దాఖలు చేసిన జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. రఘురామ పిటిషన్ ను విచారణర్హత లేదని.. వ్యక్తిగత రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పిటిషన్ ను కొట్టివేయాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు.