
తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,05,201 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 569 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,48,957 కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,823 చేరింది. కరోనా బారినుంచి 657 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి.