Homeఎడ్యుకేషన్పది పాసైన మహిళలకు శుభవార్త.. 69,100 రూపాయల వేతనంతో..?

పది పాసైన మహిళలకు శుభవార్త.. 69,100 రూపాయల వేతనంతో..?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిరుద్యోగ మహిళలకు అదిరిపోయే తీపికబురు అందించింది. కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2021 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 25,271 పోస్టులు ఉండగా ఇందులో మహిళలకు ఏకంగా 2,847 పోస్టులు ఉన్నాయి. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. పది పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాయడానికి అర్హులుగా ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా మహిళలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షతో పాటు ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష జరగగా రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌ హిందీ లేదా ఇంగ్లీష్ పై ప్రశ్నలు ఉంటాయి. ఆగష్టు 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష తేదీని త్వరలో ప్రకటించడం జరుగుతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular