
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 65,607 కరోనా పరీక్షలు నిర్వహించగా 465 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,31,683కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,729కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,316 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.