
ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 74,453 పరీక్షలు నిర్వహించగా 4,169 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,57,352 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 53 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,376 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,91,056కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.