
ఏపీలో గడిచిన 24 గంటల్లో 91,594 పరీక్షలు నిర్వహించగా 2,672 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,37,122 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,115కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 2,467 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్ కేసులున్నాయి.