
మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరదనీరు కొనసాగుతుంది. నిన్న సాయంత్రం జూరాల ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తిన అధికారులు వరద ప్రవాహం పెరగడంతో ఆదివారం 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 83 వేల క్యూసెక్కులు కొనసాగుతుండగా ఔట్ ఫ్లో 85,098 క్యూసెక్కులుగా ఉంది. జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318.42 మీటర్లు గా ఉంది.