గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. మరియమ్మ లాకప్ డెత్ పై విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరారు. రాష్ట్రంలో కొంత మంది పోలీసులు తీరు మార్చుకోవాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. హోమంత్రి, డీజీపీ ఉన్నారా?లేదా తెలియడం లేదన్నారు. కొన్నిచోట్ల పోలీసులు ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదని ఆయన సూచించారు.